
ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినప్పటికీ, పలు ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది.
ఇటీవల ఎఫ్ఏ-1 పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో, విద్యార్థుల విద్యా ప్రమాణాల దృష్ట్యా ఉపాధ్యాయుల నియామకం అత్యవసరమని అధికారులు గుర్తించారు.
ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు సంబంధిత విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు.