
పాకిస్థాన్లోని నరోవల్ జిల్లాలో 125 ఏళ్ల నాటి హిందూ ఆలయం ఆగస్టు 21న ధ్వంసమవ్వడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
మదర్సా నిర్మాణం కోసం ఆలయాన్ని కూల్చివేశారని మైనారిటీ సంఘాలు ఆరోపిస్తుండగా, వర్షాల వల్లే కూలిందని పాక్ అధికారులు చెబుతున్నారు.
ఈ ఘటనపై పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది.