
చైనాలోని చెంగ్డూలో జరిగిన బ్యాడ్మింటన్ ఆసియా అండర్-17, అండర్-15 జూనియర్ చాంపియన్షిప్స్లో భారత యువ షట్లర్ తన్వి పత్రి చాంపియన్గా నిలిచింది.
అండర్-17 విభాగంలో జరిగిన హోరాహోరీ ఫైనల్లో ఒడిషాకు చెందిన తన్వి 11-15, 15-10, 15-12తో తోటి షట్లర్ షైనా మణిముత్తును ఓడించింది.
ఈ విజయంతో తన్వి పత్రి తన కెరీర్లో తొలి అంతర్జాతీయ టైటిల్ను కైవసం చేసుకుని అరుదైన ఘనత సాధించింది.