
హైదరాబాద్లో 22ఏ నిషేధిత భూముల జాబితాపై ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, నిజమైన భూముల్లో 98 శాతం రిజిస్ట్రేషన్లు ఇప్పటికే పూర్తి చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్కు ఇప్పటివరకు 1,162 కాల్స్ రాగా, అందులో 547 వ్యవసాయానికి, 433 వ్యవసాయేతర భూములకు సంబంధించినవని మంత్రి వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన 811 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లపై విచారణకు సిద్ధమని సవాల్ విసిరిన మంత్రి, దొంగ జీవోలతో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని చూసే వారిపై కేసులు తప్పవని హెచ్చరించారు.