ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా ప్రాంతంలో బాల్టిక్ గగనతల నిఘా సమయంలో రాడార్పై అనుమానాస్పద కదలికలు నమోదయ్యాయి.
శత్రు డ్రోన్ల దండెత్తి వస్తున్నాయని భావించిన నాటో దళాలు అత్యవసర అప్రమత్తత జారీ చేసి ఇటాలియన్ యుద్ధ విమానాలను గాల్లోకి పంపాయి.
దగ్గరకు వెళ్లి పరిశీలించగా అవి డ్రోన్లు కాదని, కేవలం పక్షుల గుంపు మాత్రమేనని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.