
తన ఇద్దరు కుమారుల్లో ఒకరిని హతమార్చేందుకు ఇరాన్ కుట్ర పన్నిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోమవారం సంచలన ఆరోపణలు చేశారు.
నెతన్యాహు కుమారులు యైర్, అవ్నేర్ లలో ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారో వెల్లడించనప్పటికీ, ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ షిన్ బెట్ నెతన్యాహు కుటుంబానికి భద్రతను పెంచింది.
కొన్ని నెలల క్రితమే ఈ కుట్ర జరిగిందని జర్నలిస్ట్ అమిత్ సీగల్ పేర్కొనగా, నెతన్యాహు వ్యాఖ్యలపై ఇరాన్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన తెలియజేయలేదు.