
గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగియడంతో వరుస నష్టాలకు బ్రేక్ పడింది.
సెన్సెక్స్ 138.37 పాయింట్లు పెరిగి 74,902.59 వద్ద, నిఫ్టీ 46.30 పాయింట్లు పెరిగి 23,477.80 వద్ద స్థిరపడ్డాయి.
స్వాన్ కార్ప్, అక్యూటాస్ కెమికల్స్, వెల్స్పన్ కార్ప్ కంపెనీలు టాప్ గెయినర్లుగా నిలవగా, సాయి లైఫ్ సైన్స్, తేజస్ నెట్వర్క్స్ నష్టాలను చవిచూశాయి.