భారతదేశంలో 77 మిలియన్ల మంది డయాబెటిస్తో బాధపడుతున్న నేపథ్యంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి 'మెంతుల మొలకలు' ప్రభావవంతంగా పనిచేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
మెంతుల మొలకల్లో ఉండే కరిగే పీచు పదార్థం, 4-హైడ్రాక్సీ ఐసోల్యూసిన్ వంటి కాంపౌండ్లు గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేసి షుగర్ స్పైక్స్ను నిరోధిస్తాయి.
మధ్యాహ్న భోజనానికి ముందు 1-2 టీస్పూన్ల మొలకలను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని, అయితే మందులకు ఇది ప్రత్యామ్నాయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.