
నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రాన్ని నవంబర్ 6న విదేశాల్లో, దీపావళి కానుకగా నవంబర్ 8న భారత్లో విడుదల చేయనున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు.
ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా, సన్నీ దేవోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు.
ఈ సినిమా సంగీత హక్కులను టీ-సిరీస్ రూ. 75 కోట్లకు సొంతం చేసుకోగా, ఏ.ఆర్. రెహమాన్ మరియు హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు.