
మెడికో ప్రియాంక హత్య కేసులో నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ ఆరోపించారు.
ఘటన జరిగిన తేదీకి, అరెస్టు చేసిన తేదీకి మధ్య ఉన్న మూడు రోజుల్లో నిందితులు ఎక్కడ ఉన్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
నిందితుల ఫోన్ కాల్ డేటాను ఎందుకు సేకరించలేదని, సీసీ కెమెరాలను ఎందుకు పరిశీలించలేదని భరత్ కూటమి ప్రభుత్వాన్ని పది ప్రశ్నలు సంధించారు.