
సైప్రస్ సమీపంలో 267 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఆదివారం బోల్తా పడటంతో ఒకరు మరణించారు.
కైరినియా నుంచి టర్కీకి బయలుదేరిన ఈ పడవలో 259 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉండగా, ఇప్పటివరకు 159 మందిని సహాయక బృందాలు కాపాడాయి.
కోస్ట్ గార్డ్ ఓడలు, హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు కొనసాగుతుండగా, లైఫ్ జాకెట్లు ధరించడం వల్ల ప్రాణ నష్టం తక్కువగా నమోదైంది.