
హార్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఒక సూపర్ ట్యాంకర్ సీ మైన్ను ఢీకొనడంతో అగ్నిప్రమాదం సంభవించి నౌక నిలిచిపోయింది.
నిషేధిత మార్గంలో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) వివరణ ఇచ్చింది.
ఈ ఘటనతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 90 డాలర్లకు పైగా పెరిగింది.