
నీట్ పరీక్ష అక్రమాలపై జూలై 25న జరిగిన బిహార్ బంద్ సందర్భంగా విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు జరిపిన పోలీసు అధికారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
సివాన్లో జరిగిన ఈ ఘటనలో 15 ఏళ్ల మహ్మద్ ఆరిఫ్ మెడలో బుల్లెట్ దిగగా, శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయగా, పోలీసులు శాఖాపరమైన విచారణను ప్రారంభించారు.