
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్కు సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు విజయవంతంగా ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ నిర్వహించారు.
డాక్టర్ ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని నిపుణుల బృందం ఈ శస్త్రచికిత్సను పూర్తి చేయగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సాంబిత్ సాహు తెలిపారు.
వైద్యుల పర్యవేక్షణలో పునరావాస కార్యక్రమాలు చేపట్టి, రాబోయే 2 నుంచి 3 నెలల్లో ఆయన పూర్తిగా కోలుకుని సాధారణ దినచర్యకు తిరిగి వస్తారని వైద్యులు వెల్లడించారు.