
పెట్రోల్, డీజిల్ మరియు ఏవియేషన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)లపై ఎగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి తగ్గించింది.
సవరించిన రేట్ల ప్రకారం డీజిల్ ఎగుమతులపై విండ్ఫాల్ పన్నును లీటరుకు రూ.25 నుంచి రూ.20కి, పెట్రోల్పై రూ.1.5 నుంచి రూ.0.5కు తగ్గించారు.
అలాగే జెట్ ఫ్యూయల్ సుంకాన్ని లీటరుకు రూ.19 నుంచి రూ.15కు తగ్గించగా, కొత్త రేట్లు బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.