
టీమ్ ఇండియా సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి అజిత్ అగార్కర్ తప్పుకోనున్నారు.
ఈ నెలతో ఆయన కాంట్రాక్ట్ ముగియనుండగా, కొత్త సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎంపికపై శుక్రవారం జరిగే ఏజీఎంలో స్పష్టత రానుంది.
ఈ రేసులో మాజీ క్రికెటర్లు పార్థివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజాలు ప్రధాన పోటీదారులుగా ఉన్నట్లు తెలుస్తోంది.