
మార్కాపురం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను (ఫేజ్-1) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి సాగునీటి అవసరాలకు శ్రీకారం చుట్టారు.
వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభంతో మార్కాపురం ప్రాంత పరిధిలోని వేలాది ఎకరాల భూములకు సాగునీరు అందే మార్గం సుగమమైంది.