
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సెమీఫైనల్లో భారత జోడీ పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు.
చైనాకు చెందిన టాప్ సీడ్ ప్లేయర్లు ట్యాన్ నింగ్, లియూ షెంగ్షూతో జరిగిన పోరులో భారత జోడీ 21-18, 13-21, 8-21 తేడాతో ఓటమి పాలైంది.
తొలి సెట్లో విజయం సాధించినప్పటికీ, తర్వాతి రెండు సెట్లలో గాయత్రి-ట్రీసా జోడీ ప్రత్యర్థికి సరైన పోటీ ఇవ్వలేకపోయారు.