
ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ, వైఎస్సార్సీపీ శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
అయితే శాసన మండలి సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై పోరాడాలని పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు.
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని పార్టీ డిమాండ్ చేస్తోంది.