
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు త్వరలో రెండు కరవు భత్యాలు (డీఏ) ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొద్దిరోజుల్లోనే ఈ రెండు డీఏల చెల్లింపు ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసే అవకాశం ఉంది.