
అమెరికా మరియు ఇజ్రాయెల్ ఒత్తిళ్లకు ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగబోదని ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ క్షేమంగా ఉన్నారని, తన విధులను ఆయన క్రమం తప్పకుండా నిర్వర్తిస్తున్నారని ఆయన తెలిపారు.
ఖమేనీ ఆచూకీపై వస్తున్న ఊహాగానాలన్నీ ప్రత్యర్థులు సృష్టిస్తున్న సమాచార యుద్ధంలో భాగమేనని పెజెష్కియాన్ కొట్టిపారేశారు.