
ప్రధాని నరేంద్ర మోదీ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి, భద్రతా బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించారు.
ప్రధానిగా మోదీ ఎర్రకోటపై జెండాను ఎగురవేయడం ఇది 13వ సారి కాగా, ఈ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.
జెండా ఆవిష్కరణ అనంతరం వాయుసేన హెలికాఫ్టర్ల ద్వారా ఎర్రకోటపై పూలవర్షం కురిపించగా, ప్రధాని మోదీ వందేమాతరం గీతాన్ని ఆలపించి ప్రసంగించారు.