దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్ను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రారంభించాలని ఐసీసీ భావిస్తోంది.
మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ సుమారు 50 రోజుల పాటు జరగనుండగా, నవంబర్ 21న ఫైనల్ మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది.
ఈ టోర్నీ కోసం దక్షిణాఫ్రికాలో 8, జింబాబ్వేలో 3, నమీబియాలో 1 కలిపి మొత్తం 12 వేదికలను ఐసీసీ ఇప్పటికే ఖరారు చేసింది.