
పోటీ పరీక్షల అభ్యర్థులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
కొన్ని కోచింగ్ కేంద్రాలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను నిరసనల్లో పాల్గొనేలా ఉసిగొల్పుతున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు అందాయి.
ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సంస్థల నియంత్రణ నిబంధనలు 2026, జీవో నెంబర్ 9 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చట్టప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు.