
విశాఖపట్నంలోని ఇసుకతోట జంక్షన్లో ఐబీఎం తన నూతన 'కన్సల్టింగ్ ఫ్యూచర్నౌ సెంటర్'ను బుధవారం రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు.
ఈ కేంద్రం కృత్రిమ మేధస్సు (AI), హైబ్రిడ్ క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ మరియు డేటా అనలిటిక్స్ రంగాల్లో ప్రపంచవ్యాప్త ఖాతాదారులకు సేవలు అందించనుంది.
భారతదేశంలో సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ఐబీఎం ఇండియా, సౌత్ ఏసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ సమక్షంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.