విశాఖలో జరిగిన వైయస్సార్సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కన్నీళ్లు పెట్టుకున్నారు.
తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీని వీడి టీడీపీలో చేరడంపై సమావేశంలో ప్రస్తావిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
నమ్మినవారే మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.