
సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామానికి చెందిన అఖిల్, తన మూడో ప్రయత్నంలో 566వ ర్యాంకు సాధించి సివిల్స్ విజేతగా నిలిచారు.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అఖిల్, రోజుకు 8 గంటల చొప్పున క్రమం తప్పకుండా చదవడం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.
తొలి రెండు ప్రయత్నాల్లో విఫలమైనా, ఆత్మవిశ్వాసం మరియు సెల్ఫ్ మోటివేషన్తో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకున్నానని ఆయన వివరించారు.