
కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిని చిప్పగిరిలోని ఆయన నివాసంలో ఆగస్టు 2న తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు అరెస్టు చేశారు.
చిప్పగిరి పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 37/2026 మరియు 38/2026 కేసుల్లో ఎమ్మెల్యే ఏ-1గా ఉండగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి.
నేమకల్లు, సంగాల గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన ఘటనలో ఎమ్మెల్యేతో పాటు 34 మందిపై కేసులు నమోదు చేయగా, 16 మందిని అరెస్టు చేసి కోర్టు రిమాండ్కు తరలించింది.