
నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక భద్రతా ఫీచర్లతో కూడిన కొత్త స్మార్ట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డులను సిద్ధం చేసింది.
ఈ కార్డులను ఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.
కార్డులో ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, యూవీ కాంతిలో కనిపించే చిహ్నం మరియు స్పర్శ ద్వారా గుర్తించే ఉబ్బెత్తు అక్షరాలు వంటి భద్రతా అంశాలను పొందుపరిచారు.