
గుజరాత్లో చాందీపురా వైరస్ బారిన పడి ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మరణించగా, 35 మందికి వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ నిర్ధారించింది.
15 ఏళ్ల లోపు పిల్లలపై ప్రభావం చూపే ఈ వైరస్, ఇసుక ఈగల ద్వారా వ్యాపిస్తుందని, దీనికి ప్రస్తుతం ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదని వైద్య నిపుణులు తెలిపారు.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మట్టి గోడల పగుళ్లను పూడ్చాలని, బాధితులకు ఐసీయూలో వెంటిలేటర్ సదుపాయంతో తక్షణ చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.