
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 12.5 శాతం దిగుమతి సుంకాల నిర్ణయాన్ని సవాలు చేస్తూ 25 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి.
ట్రేడ్ యాక్ట్-1974 సెక్షన్ 301 కింద ఈ సుంకాలు విధించడం అధికార దుర్వినియోగమని న్యూయార్క్లోని యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో పిటిషన్ దాఖలైంది.
భారత్పై సుంకాన్ని 12.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గించినప్పటికీ, గంపగుత్త సుంకాలు సమర్థనీయం కావని పిటిషనర్లు వాదిస్తున్నారు.