
దుబాయ్లోని జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతం మరియు పోర్టు సమీపంలో బుధవారం తెల్లవారుజామున 20 నిమిషాల వ్యవధిలో ఏడు సార్లు వరుస పేలుళ్లు సంభవించాయి.
యెమెన్ నుంచి యూఏఈపై క్షిపణి దాడులు జరిగినట్లు ఇరాన్ న్యూస్ ఏజెన్సీ మెహర్ పేర్కొనగా, ఆయిల్ వేర్హౌస్లలో అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని మరికొన్ని సంస్థలు తెలిపాయి.
ఈ ఘటనపై యూఏఈ అధికారులు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు, అయితే ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.