
వర్షాకాలం ముగిసి శీతాకాలం వస్తున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గుల వల్ల పిల్లలు వైరల్ ఫీవర్ బారిన పడకుండా పోషకాహారం అందించడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి పెరుగు, రోగనిరోధక శక్తి కోసం వెల్లుల్లి, పసుపు పాలు మరియు నానబెట్టిన బాదం పప్పులను ఆహారంలో చేర్చాలి.
విటమిన్ సి లభించే నిమ్మజాతి సిట్రస్ పండ్లను క్రమం తప్పకుండా ఇస్తూ, జంక్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్కు పిల్లలను దూరంగా ఉంచాలని నిపుణులు తెలిపారు.