
2027 ఫిబ్రవరి 14 నుండి 28 వరకు జరగనున్న తొలి ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఐసీసీ సెప్టెంబర్ 2న అధికారికంగా ప్రకటించింది.
ఈ టోర్నమెంట్లోని మ్యాచ్లు ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియం మరియు వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు.
జూలై 6 నాటి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక అనే ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి.