
అలాస్కా సముద్ర తీరంలో చిక్కుకుపోయిన ఒక బోటును రక్షించేందుకు ముందుకు రాలేదని మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్కు చెందిన విలాసవంతమైన నౌకపై విమర్శలు వెల్లువెత్తాయి.
సముద్రంలో ఇబ్బందుల్లో ఉన్న వారిని పట్టించుకోకుండా జుకర్బర్గ్ నౌక వెళ్ళిపోయిందనే ఆరోపణలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
ఈ ఘటనపై జుకర్బర్గ్ బృందం నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.