
ఇ-కామర్స్ సంస్థలు ఆఫర్ల పేరుతో చేసే మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం నిబంధనలను సవరించింది.
ఇకపై డిస్కౌంట్ ధరలను ప్రకటించే ముందు, అసలు ధరను స్పష్టంగా వెల్లడించడం తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
ఆఫర్ల సీజన్కు ముందు ధరలు పెంచి, ఆపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు చూపే పద్ధతికి ఈ మార్పులతో అడ్డుకట్ట పడనుంది.