
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న 'ఎల్లమ్మ' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది.
ఈ చిత్రాన్ని 'బలగం' సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తుండగా, ఇందులో దేవిశ్రీ ప్రసాద్ పర్షి అనే పాత్రలో కనిపించనున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు వెండితెరపై నటుడిగా మారుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.