
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శల పేరిట రాష్ట్రంలో అరాచకం, విధ్వంసం సృష్టిస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత ఆగస్టు 6న ఆరోపించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా జగన్ చేస్తున్న బలప్రదర్శనలపై పోలీసులు నిఘా ఉంచారని, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
రాష్ట్రంలో రప్పా రప్పా నాటకాలకు స్వస్తి పలికి ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.