
థాయ్లాండ్కు చెందిన వ్యాపారవేత్త సిరిపాంగ్ అకారశ్రీయుక్, బౌద్ధ సన్యాసిగా మారేందుకు తన 'హావెల్స్' ఐస్క్రీమ్ కంపెనీని రూ. 47 కోట్లకు అమ్మకానికి పెట్టారు.
కొనుగోలుదారుని పరిచయం చేసిన వారికి రూ. 1.4 కోట్ల ఫీజు చెల్లిస్తానని ఆయన ప్రకటించారు.
1999లో స్థాపించిన ఈ కంపెనీని వదిలి, రెండేళ్లలో ఆశ్రమాన్ని స్థాపించి ధ్యాన సాధన చేయడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు.