
22ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్న ప్రైవేటు ఆస్తుల విషయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తప్పులుంటే సరిదిద్దుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఈ సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్కు ఇప్పటివరకు 1,162 కాల్స్ రాగా, అందులో 980 ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
మేడ్చల్ జిల్లాలో కలెక్టర్ సంతకంతో నకిలీ మెమో సృష్టించి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రయత్నించిన వారిపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.