
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోతే రాష్ట్రానికి సుమారు రూ. 28 వేల కోట్ల కేంద్ర నిధులు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
జీవీఎంసీతో సహా అన్ని స్థానిక సంస్థల్లో ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయాలని సంబంధిత శాఖలకు సీఎం సూచించారు.