
హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ ఆఫీసును బీజేపీ శ్రేణులు ముట్టడించాయి.
ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ జిల్లా కార్యాలయంపై దాడి చేసి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.
ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలువురు నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు.