
విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు ఏడు రోజుల కస్టడీ బుధవారంతో ముగిసింది.
దర్యాప్తు బృందం విచారణలో భాగంగా ఆయనను దాదాపు 500 ప్రశ్నలు అడిగినప్పటికీ, ఒక్కదానికి కూడా ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు.
నిందితుడు విచారణలో సహకరించకుండా మౌనం వహించడంతో కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెల్లడి కావాల్సి ఉంది.