
చంద్రునిపై దీర్ఘకాలిక మానవ అన్వేషణ కోసం నాసా చేపడుతున్న ఆర్టెమిస్ మిషన్ కార్యక్రమంలో భాగస్వామి కావాలని ఇస్రోను అమెరికా అంతరిక్ష సంస్థ ఆహ్వానించింది.
చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో మంచును వనరుగా వాడుకుంటూ మానవ నివాసానికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
భారత్ ఇప్పటికే 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఈ సహకారం ఇరు దేశాల అంతరిక్ష ప్రయాణంలో కీలక ముందడుగు కానుంది.