
పాకిస్థాన్లోని పంజాబ్, సింధ్ ప్రావిన్స్లలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 16 మంది మరణించగా, 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
పంజాబ్లోని రహీమ్ యార్ ఖాన్ జిల్లాలో ట్రైలర్ ఢీకొన్న ఘటనలో 5గురు మృతి చెందగా, సింధ్లోని జాకోబాబాద్లో బస్సు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదాల్లో గాయపడిన వారిని షేక్ జాయేద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించామని, లాహోర్కు 600 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటనలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.