
కృత్రిమ మేధ (AI) విస్తృతి పెరగడం, డేటా సెంటర్ల నిర్వహణ వ్యయాలు భారీగా పెరగడంతో ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల నియామకాలు నిలిచిపోయాయని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు తెలిపారు.
సర్వర్లు, మెమరీ చిప్ల ధరలు పెరగడం వల్ల కంపెనీలు తమ బడ్జెట్ను ఏఐ మౌలిక వసతుల వైపు మళ్లించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఆటోమేషన్ వల్ల తయారీ రంగంలో కూడా ఉద్యోగాల సృష్టి మందగించిందని, భవిష్యత్తులో సార్వత్రిక ప్రాథమిక ఆదాయం వంటి ప్రతిపాదనలపై రాజకీయ ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు.