
2015లో సీఐడీ నమోదు చేసిన పోక్సో కేసులో, మైనర్ బాలికలను వ్యభిచారంలోకి దించిన ముఠాకు చెందిన 33 మందిని నాంపల్లి పోక్సో కోర్టు దోషులుగా నిర్ధారించింది.
ఈ కేసులో ఐదుగురు దోషులకు జీవిత ఖైదు, ముగ్గురికి 14 ఏళ్ల జైలు శిక్ష, 14 మందికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.
బాధితులైన తొమ్మిది మంది బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.