
ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయానికి శుక్రవారం ఉదయం 6 గంటలకు 2,07,821 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 873.20 అడుగులకు చేరుకోగా, నీటి నిల్వ 155.20 టీఎంసీలుగా నమోదైంది.
విద్యుత్ ఉత్పత్తి కోసం 30,518 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా, పోతిరెడ్డిపాడుకు 2,750 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు.