
శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తల్లిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా ఎమ్మెల్యేలను అడ్డుగా పెట్టుకుని రాజకీయం చేయడం దారుణమని, పోలీసులపై చేయి చేసుకున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
సభలో ఈ ఘటనపై మంత్రి సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు.