
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫీచర్లతో చిన్నారులకు వ్యసనం కలిగిస్తున్నారనే ఆరోపణలపై మెటా సంస్థపై అమెరికాలోని ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో విచారణ ప్రారంభమైంది.
ఈ కేసులో రాష్ట్రాల తరఫు న్యాయవాదులు 200 బిలియన్ డాలర్ల పరిహారం కోరగా, మెటా సంస్థ 1.4 ట్రిలియన్ డాలర్ల జరిమానాను రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని పేర్కొంది.
సుమారు ఆరు వారాల పాటు కొనసాగనున్న ఈ విచారణలో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, ఇన్స్టాగ్రామ్ చీఫ్ ఆడమ్ మొసేరీ సాక్ష్యం చెప్పనున్నారు.